Monday, September 23, 2024
Homeజాతీయంకల్తీ నెయ్యి ప్రయశ్చితం కోసం..

కల్తీ నెయ్యి ప్రయశ్చితం కోసం..

కల్తీ నెయ్యి ప్రయశ్చితం కోసం..
తిరుపతిలో మహా శాంతి హోమం..
స్పాట్ వాయిస్, బ్యూరో: తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి హోమం నిర్వహించారు. శ్రీవారి నైవేద్యాలు, లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతిహోమం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించిన ఈ హోమం 10 గంటల వరకు నిర్వహించారు. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ చేశారు.
అపచారం కలిగింది..
శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండటం వల్ల అపచారం కలిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా శాంతిహోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు. లడ్డూ కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలతో లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందని పేర్కొన్నారు. అయినప్పటికీ భక్తుల్లో ఆందోళన తొలగించేందుకు ఇవాళ శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments