Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుఉరి వేసుకున్న ప్రేమికులు

ఉరి వేసుకున్న ప్రేమికులు

ప్రియురాలి మృతి..
ప్రాణాలతో బయటపడిన ప్రియుడు..
మరోసారి కత్తితో మెడకోసుకున్న ఆత్మహత్యయత్నం..
ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
రవీందర్ పరిస్థితి విషమం..
మానుకోట జిల్లాలో విషాదం
స్పాట్ వాయిస్, బయ్యారం: ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ కుమార్తె (వివాహిత) రవళి (24) అదే గ్రామానికి చెందిన వీరభద్రం కుమారుడు రవీందర్ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత ఏప్రిల్ నెలలో భువనగిరి లో ఉంటున్న రవళిని తీసుకొని రవీందర్ ఆంధ్రకు వెళ్లి అక్కడ జీవిస్తున్నారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తీసుకువచ్చిన కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో మూడు రోజులుగా రవళి రవీందర్ ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అయితే రవళి మృతి చెందగా, రవీందర్ కు ప్రాణాలతో బయపటపడ్డాడు. దీంతో కత్తితో మెడ కోసుకొని మరోసారి రవీందర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న సీఐ రవికుమార్, ఎస్సై ఉపేందర్ వివరాలు సేకరించారు. రవళి వివాహిత కావడంతో భర్త కుటుంబ సభ్యులతో సోమవారం గ్రామంలో కుల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ ఉంది. ఈ క్రమంలో వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ ఎంజీఎం లో చికిత్స పొందుతున్న రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments