Friday, April 18, 2025
Homeలేటెస్ట్ న్యూస్ప్రేమ పెండ్లి.. నాలుగు ఇండ్లు దహనం..

ప్రేమ పెండ్లి.. నాలుగు ఇండ్లు దహనం..

ఉద్రిక్తతకు దారి తీసిన ప్రేమ వివాహం 

నాలుగు ఇండ్లు దహనం

పోలీసులు పికెటింగ్

స్పాట్ వాయిస్, నర్సంపేట : ఓ ప్రేమ వివాహం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటికాల పల్లిలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఉటుకాలపల్లి గ్రామ సర్పంచ్ మండల రవీందర్ కూతురు మండల కావ్య శ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కావ్య శ్రీ హసన్ పర్తి పరిధిలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండగా, రంజిత్ నర్సంపేట పట్టణ పరిధి సర్వాపురంలోని ఓ బ్యాండు ఏటీఎం వద్ద వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న కావ్యశ్రీ, రంజిత్ ఐదారు రోజులుగా కనిపించడం లేదు. ఈ క్రమంలో వారు ప్రేమ వివాహం చేసుకోగా, విషయం తెలుసుకున్న బాలిక తండ్రి హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారిద్దరు సరెండర్ అయ్యారు. కావ్య శ్రీని తనతో రమ్మని తండ్రి ఎంత బతిమిలాడినా రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన సర్పంచ్ రవీందర్ ఆగ్రహంతో రంజిత్ ఇంటితో పాటు అతడికి సహకరించిన  మిత్రుల  ఇండ్లను దహనం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments