Friday, September 20, 2024
Homeతెలంగాణఆందోళన చేస్తున్నది బీఆర్ఎస్ నేతలే..

ఆందోళన చేస్తున్నది బీఆర్ఎస్ నేతలే..

రైతులు ధర్నాలకు రావడం లేదు..
కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
స్పాట్ వాయిస్, హన్మకొండ: రాజ‌కీయ స్వార్థంతోనే బీఆర్ఎస్ పార్టీ రైతు రుణ‌మాఫీపై దుష్ ప్రచారం చేస్తోందని కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు రుణ‌మాఫీ కాలేదంటూ ఆందోళ‌న‌లు చేప‌ట్టడం అర్థర‌హితమన్నారు. బీఆర్ఎస్ ఆందోళ‌న‌ల్లో కార్యక‌ర్తలు, నేత‌లు త‌ప్పా..! రైతులెవ్వరూ పాల్గొన‌డం లేదన్నారు. రైతు రుణ‌మాఫీ దాదాపుగా పూర్తి కావొచ్చిదని, సాంకేతిక కార‌ణాలు, వివిధ స‌మ‌స్యల కార‌ణంగానే అతికొద్దిమందికి సంబంధించిన రుణ‌మాఫీ ప్రాసెసింగ్‌లో ఉన్నమాట వాస్తవమన్నారు. ఇలాంటి స‌మ‌స్యలు ఉన్న రైతుల నుంచి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకుపోతోందన్నారు. ద‌ర‌ఖాస్తుల‌ను కూడా స్వీక‌రించి.. పార‌ద‌ర్శకంగా ప్రక్రియ‌ను ముందుకు తీసుకెళ్తోందని ఇనగాల చెప్పారు. దేశ చ‌రిత్రలో ఇంత పెద్ద మొత్తంలో రుణ‌మాఫీ చేసింది.. కేవ‌లం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమేన‌న్న విష‌యాన్ని ప్రజ‌లంతా గుర్తించారని, రుణమాఫీపై రైతాంగం హ‌ర్షం వ్యక్తం చేస్తోందన్నారు. రైతుల‌కు మేలు చేకూరుడం బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదని, అందుకే నిర‌స‌న‌ల పేరిట‌.. రాజ‌కీయ నాట‌కాల‌కు తెర‌తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కూడా ఈ ప‌రిణామాల‌ను ఈస‌డించుకుంటున్న బీఆర్ ఎస్ నేత‌ల‌కు బుద్ధి రావ‌డం లేదన్నారు. రాజ‌కీయ ప్రేరేపిత ఆందోళ‌న‌లు.. ప్రజాక్షేత్రంలో నిల‌వ‌వ‌న్న నిజం బీఆర్ఎస్ తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజ‌ల‌కు ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చేందుకు సిద్ధంగా ఉందని,
ప్రజా పాల‌న కొన‌సాగిస్తున్న ప్రభుత్వానికి ప్రజ‌లంతా అండ‌దండ‌గా ఉంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ రాజ‌కీయ నాట‌కాల‌ను ప్రజ‌లు న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరని, వారిని త‌రిమికొట్టేందుకు ప్రజ‌లంతా సిద్ధంగా ఉన్నారని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments