Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుకేటీపీపీ ఉద్యోగుల జేఏసీ దాతృత్వం..

కేటీపీపీ ఉద్యోగుల జేఏసీ దాతృత్వం..

మోరంచపల్లిలో రూ.2వేల చొప్పున అందజేత
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ వద్ద ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఉద్యోగుల జేఏసీ దాతృత్వం చాటుకుంది. ఇటీవల జరిగిన వరద విపత్తులో సర్వం కోల్పోయి రోడ్డున పడిన మోరంచపల్లి గ్రామానికి చెందిన 300 కుటుంబాలకు రూ. 2000 చొప్పున పంపిణీ చేశారు. కేటీపీపీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా తమ తమ వేతనాల నుంచి కొంత డబ్బులు పొగుచేసి గ్రామంలోని ప్రతీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. మోరంచపల్లి వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చి తమ వంతుగా [the_ad id=’17389′] సాయాన్ని అందించిన కేటీపీపీ ఉద్యోగుల జేఏసీ నాయకులు, సభ్యులను పలువురు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments