Thursday, September 19, 2024
Homeజిల్లా వార్తలుకోటగుళ్ల శిల్ప సంపద అద్భుతం..

కోటగుళ్ల శిల్ప సంపద అద్భుతం..

కోటగుళ్ల శిల్ప సంపద అద్భుతం

టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ మల్లు రవి

స్పాట్ వాయిస్, గణపురం: కాకతీయుల శిల్ప సంపద అద్భుతమని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం రాత్రి ఆయన గణపురం మండలం లోని కోట గుళ్ళ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ పరిసరాలను, శిల్ప సంపదను తిలకించారు. రామప్పను పోలిన విధంగా ఉండే కోటగుళ్ల శిల్పసంపదను భావితరాలకు అందించాలని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా గణపురం మండల కేంద్రానికి వచ్చిన ఆయన ఆలయం సందర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు దూడపాక శంకర్, విడిదినేని అశోక్, మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, పోశాల మహేష్ గౌడ్, అఖిల్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments