Sunday, May 25, 2025
Homeతెలంగాణమంత్రి కొండా సురేఖకు డెంగీ పాజిటివ్

మంత్రి కొండా సురేఖకు డెంగీ పాజిటివ్

మంత్రి కొండా సురేఖకు డెంగీ పాజిటివ్

స్పాట్ వాయిస్, బ్యూరో: మంత్రి కొండ సురేఖఅనారోగ్యం బారిన పడ్డారు. సోమవారం ఆమెకు డెంగీ పాజిటివ్ నిర్ధారణ అయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో జ్వరం బారిన పడి, తన మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఐదు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు పలు వైద్య పరీక్షలు చేసి డెంగీ పాజిటివ్ గా నిర్ధారించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. మేడారం జాతర, ప్రభుత్వ కార్యక్రమాలను మంత్రి పర్యవేక్షిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో మేడారం సమ్మక్క సారక్క జాతరలో మంత్రి పాల్గొంటారని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments