Thursday, April 17, 2025
Homeక్రైమ్అందరు చూస్తుండగానే చంపేశారు..

అందరు చూస్తుండగానే చంపేశారు..

నడిరోడ్డుపై గొంతుకోసి.. బండరాయితో కొట్టారు..
స్పాట్ వాయిస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో దారుణ్య హత్య జరిగింది. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే నెపంతో మహేష్ అనే ఓ యువకుడిని యువతితో పాటుగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు దారుణంగా చంపేశారు. జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఈ ఘోర ఘటన జరిగింది. ముస్కె మహేశ్(28) బైక్ లో పెట్రోల్ కొట్టించుకొని వస్తుండగా.. నలుగురు అడ్డగించారు. గొంతుకొసి ఆపై బండరాయితో తలపగలగొట్టారు. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగినప్పటికీ ఎవరూ కూడా ఆపేందుకు ముందుకు రాలేదు. ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతికి, మహేశ్ కు నడుమ గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ పై వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ యువతి తల్లి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో మహేశ్ ఫోన్ లో అసభ్య మెసేజ్ లతో వేధిస్తుండడంతో ఆ కుటుంబం భరించలేకపోయింది. వివహిత తన తల్లిదండ్రులు, సోదరుడితో మాటు వేసి మంగళవారం ఉదయం మహేశ్ ను చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే మరోవైపు మహేశ్ ను చంపిన నలుగురిని తమకు అప్పగించాలంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments