గజ్వేల్ నుంచి టికెట్ కోసం దరఖాస్తు..
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు నువ్వానేనా అన్నట్లుగా సాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించి స్ర్కూటిని పూర్తి చేసింది. ఇక బీజేపీ సైతం దరఖాస్తులను ఆదివారం వరకు తీసుకుంది. ఈసారి ఎలాగైన తెలంగాణలో పట్టు సాధించాలనే కసితో కాషాయం అడుగులు వేస్తోంది. ఈనేపథ్యంలో కేసీఆర్ పై పోటీగా ఈటల రాజేందర్ భార్య జమునను దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ నుంచి ఈటల జమున పోటీ చేయనున్నట్లు సమాచారం ఆదివారం ఈ జమున పేరుతో కార్యకర్తలు గజ్వేల్ బీజేపీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆ దరఖాస్తు తాము చేసుకోలేదని, తమ పేరిట అభిమానులు చేసి ఉంటారని ఈటల వర్గం చెబుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యె టిక్కెట్ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా వారం రోజుల్లో మొత్తం 119 స్థానాలకు 6,011 దరఖాస్తులు వచ్చాయి.
కేసీఆర్ పై పోటీకి ఈటల జమునా..!
RELATED ARTICLES
Recent Comments