Wednesday, April 9, 2025
Homeజిల్లా వార్తలులోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
కాటారం ఎస్సై మ్యాక అభినవ్
స్పాట్ వాయిస్, కాటారం : భూపాలపల్లి జిల్లా జేఎఫ్ సీఎం కోర్టులో ఈనెల 1 నుంచి 9వ తేదీ వరకు జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని, దానిని కాటారం మండల పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై మ్యాక అభినవ్ ప్రకటనలో కోరారు. చిన్నచిన్న దొంగతనాలు, చీటింగ్, యాక్సిడెంట్, కొట్టుకున్న కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులతో పాటు కరోనా సమయంలో వేసిన నో మాస్క్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు, ఇతర రాజీ పడ దగు కేసులు ఉన్నట్లయితే నేషనల్ లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే ఫిర్యాదుదారుడు, నేరస్తులు తమ ఆధార్ కార్డు తీసుకుని భూపాలపల్లి జే ఎఫ్ సీ ఎం కోర్టుకు రావాలని ఈ సందర్భంగా ఎస్సై అభినవ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments