Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుఫలించిన జర్నలిస్టుల పోరాటం

ఫలించిన జర్నలిస్టుల పోరాటం

ఫలించిన జర్నలిస్టుల పోరాటం
పుష్కరాల విధుల నుంచి సీఐ జానీ నర్సింహులు తొలగింపు
స్పాట్ వాయిస్, మహాదేవపూర్ : జర్నలిస్టుల పోరాటం ఫలించింది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద సీఐ జానీ నర్సింహులు జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించడంపై వారంతా ఆందోళనకు దిగారు. ఈవిషయమై స్పందించిన  ఎస్పీ సురేందర్ రెడ్డి సీఐ జానీ నర్సింహులును వెంటనే  పుష్కరాల విధుల నుంచి తొలిగించారు. కాగా, మీడియాతో స్నేహభావంతో పోలీసులు మెలగాలని, జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. పుష్కరాల విజయవంతంలో మీడియా సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా కాటారం డీఎస్పీ బోనాల కిషన్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments