పాలకుర్తి సమ్మక్క సారలమ్మలు ఎలా ఉన్నారు..?
యశస్విని, ఝాన్సీరెడ్డికి సీఎం ఆత్మీయ పలకరింపు
నియోజవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డికి వినతి
సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : పాలకుర్తి సమ్మక్క, సారలమ్మకు ఎలా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశస్విని, ఝాన్సిరెడ్డిని ఆత్మీయంగా పలకరించారు. చెల్లి యశస్విని రెడ్డి బాగున్నావా.. అక్క ఝాన్సీరెడ్డి ఎలా ఉన్నారు..? అంటూ ఇద్దరు ఆడబిడ్డలతో మాట్లాడారు. ఆదివారం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి ఝాన్సీరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నియోజవర్గ అభివృద్ధి, ప్రాజెక్టులు, తొర్రూరు మున్సిపాలిటీ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తారు. తొర్రూరు పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల ద్వారా రూ.50 కోట్ల మేర నిధులు కేటాయించాలని విన్నవించారు. అలాగే పట్టణంలో రోడ్ల విస్తరణ, డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, పార్కులు, నీటి సరఫరా, ఇతర మౌలిక అవసరాల కోసం ఈ నిధులు అత్యవసరమని వివరించారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించనున్నట్లు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో వరంగల్ జెడ్పీ మాజీ చైర్మన్ లకావత్ ధన్వంతి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
పాలకుర్తి సమ్మక్క సారలమ్మలు ఎలా ఉన్నారు..?
RELATED ARTICLES
Recent Comments