Friday, September 27, 2024
Homeలేటెస్ట్ న్యూస్పేకాట ఆడుతున్న మహిళలు..

పేకాట ఆడుతున్న మహిళలు..

అరెస్టు చేసిన పోలీసులు
స్పాట్ వాయిస్, బ్యూరో: మహిళలు పేకాటాడుతూ పట్టుబడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ నగరంలోని సరస్వతి నగర్ లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి నాలుగో అంతస్తులో నలుగురు మహిళలు పేకాట ఆడుతున్నట్టుగా తెలిసింది. దీంతో పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పోలీసులకు పట్టుబడిన మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని సమాచారం. పేకాటలో పట్టుబడిన మహిళల దగ్గర నుండి 5 సెల్ ఫోన్లు, రూ.15,100ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments