Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుచనిపోయాడనుకుంటే షాకిచ్చాడు..

చనిపోయాడనుకుంటే షాకిచ్చాడు..

కంగుతిన్న పోలీసులు..
స్పాట్ వాయిస్, హన్మకొండ: నీటిలో ఓ వ్యక్తి 5 గంటల పాటు తెలియాడుతుంటే అందరూ చనిపోయాడనుకున్నారు. కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరూ..? ఏం జరిగిందోనంటూ అందరూ ఉత్కంఠగా చెరువు గట్టుపై ఉండి వేచి చూస్తున్నారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతడిని బ‌య‌ట‌కు తీసేందుకు య‌త్నించిన పోలీసులు షాక్‌కు గుర‌య్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా ప‌రిధిలోని రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని.. బయట‌కు లాగారు. కానీ అత‌ను ప్రాణాల‌తో ఉన్నాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 10 రోజుల నుంచి గ్రానైట్ క్వారీలో రోజుకు 12 గంటల పాటు ఎండ‌కు ప‌ని చేస్తున్నట్లు తెలిపాడు. ఆ వేడికి త‌ట్టుకోలేక నీటిలో సేద‌తీర‌డానికి వ‌చ్చిన‌ట్లు అత‌ను పోలీసుల‌కు తెలిపాడు. అప్పటి వరకు ఎంతో టెన్షన్ గా ఎదురుచూసిన వారంతా.. అతడు నీళ్లలోంచి నడిచి రావడంతో షాక్ గురవడమేకాదు.. ఆశ్చర్యానికి లోనయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments