అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యా యత్నం..
చికిత్స పొందుతూ మృతి
స్పాట్ వాయిస్ దామెర: మండల కేంద్రానికి చెందిన పెంట రాజు ( 40) వ్యవసాయం చేసుకుంటూ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి నిర్మాణం కోసం, ట్రాక్టర్ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఈ నెల 27 వ తేదీ సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రి కి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. మృతుని భార్య మంజుల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొంక అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.
Recent Comments