Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుమైనార్టీ గురుకుల పాఠశాలలో ఇఫ్తార్ విందు

మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇఫ్తార్ విందు

స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో గురువారం సాయంత్రం పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అనంతరం ఇటీవల ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు చేపట్టిన ఆకుతోట రజితను కమిటీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మొహమ్మద్ ఇర్ఫాన్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ శంషోద్దీన్, ఉపాధ్యక్షులు మొహమ్మద్ పాషా, సెక్రటరీ సయ్యద్ కుతూబ్, టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మహమ్మద్ సాబీర్ ఖాన్, పేరెంట్స్ మొహమ్మద్ అఫ్జల్, ఇస్మాయిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments