Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్హెచ్ ఆర్ సీ (కౌన్సిల్) ఉమ్మడి జిల్లా ఇన్ చార్జిగా తాళ్లపల్లి తిరుపతి

హెచ్ ఆర్ సీ (కౌన్సిల్) ఉమ్మడి జిల్లా ఇన్ చార్జిగా తాళ్లపల్లి తిరుపతి

తిరుపతికి అదనపు బాధ్యతల అప్పగింత
ఉత్తర్వులు జారీ చేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్ రాజారపు ప్రతాప్
శుభాకాంక్షలు తెలిపిన హనుమకొండ టౌన్ కన్వీనర్ రాజారపు రాజు
స్పాట్ వాయిస్, వరంగల్ : హెచ్ ఆర్సీ (కౌన్సిల్) హన్మకొండ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తాళ్లపల్లి తిరుపతికి ఉమ్మడి వరంగల్ జిల్లాల ఇన్ చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆదివారం కాజీపేట లోని తన స్వ గృహంలో తిరుపతికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్ రాజారపు ప్రతాప్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ తనకు అదనపు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర చైర్మన్ రాజారపు ప్రతాప్ కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాల కన్వీనర్ చిలువేరు శంకర్ తో కలిసి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని అధ్యక్ష కార్యవర్గాన్ని సమన్వయం చేసుకుంటూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎజెండా ను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో కూడా పటిష్టమైన కార్యవర్గాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. మానవ హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తానని, అసలైన బాధితులకు భరోసా కల్పించడమే కర్తవ్యంగా భావిస్తానని తెలిపారు. ‘అనాథలకు ఆసరా పెన్షన్’ పేరిట అనాథల హక్కుల కోసం వారి పక్షాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి, శాసన సభ, పార్లమెంటులో అనాథల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువచ్చలా న్యాయ పోరాటం చేయడానికి రాష్ట్ర కమిటీ చైర్మన్ రాజారపు ప్రతాప్ ఆధ్వర్యంలో వివిధ అనాథ ఆశ్రమాల నిర్వాహకులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే వరంగల్ టౌన్ కన్వీనర్ గా ఫర్ ద పీపుల్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల కన్వీనర్ చిలువేరు శంకర్ తాళ్లపల్లి తిరుపతికి శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో హన్మకొండ టౌన్ కన్వీనర్ రాజారపు రాజు, వేలేరు మండల అధ్యక్షుడు కీర్తి సురేష్, ధర్మసాగర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, వలంటీర్లు దాసారపు రాజు, కొత్తూరు ప్రశాంత్, మల్లమరు చరణ్, మామిడాల ఉమేష్, మార్త రమేష్, దోమల మమత, అరుణ, విర్జు సుమన్, ఎండీ అబ్దుల్ రహీమ్, చారి, అయూబ్, రమేష్, బత్తిని రాజు, రేణుకుంట్ల రాజేష్, జన్ను యువరాజ్ తదితరులు తాళ్లపల్లి తిరుపతికి శుభాకాంక్షలు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments