Wednesday, April 9, 2025
Homeలేటెస్ట్ న్యూస్జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు

జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు

వరంగల్, హన్మకొండలో సొసైటీల్లో లేని వారి లిస్టు రెడీ చేయాలి
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు సూచన
లిస్ట్ ఫైనల్ కాగానే స్థలం ఇవ్వాలని కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశం
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్,హన్మకొండ జిల్లాల్లోని జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం వరంగల్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ను టీయూడబ్ల్యూజే 143 నేతలు ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల సమస్యలపై కలిశారు. వరంగల్ జిల్లాలో రెండు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలు ఉండగా, అధికారులు గతంలోనే వాటికి భూములను కేటాయించారని చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి భూమి ధర చెల్లింపునకు ఖాతా నంబర్ ఇస్తే తాము డబ్బులు చెల్లిస్తామని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే హౌసింగ్ సొసైటీల్లో లేని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయమై టీయూడబ్ల్యూజే 143 నేతలు లెనిన్ , కక్కెర్ల అనిల్ కుమార్ గౌడ్, తుమ్మ శ్రీధర్ రెడ్డి, మెండు రవీందర్, చిలుముల సుధాకర్, రాజేంద్రప్రసాద్, తదితరులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి రెండు హౌసింగ్ సొసైటీల్లోని సభ్యులు పోగా, మిగిలిన సభ్యుల జాబితాను రూపొందించాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు కేటీఆర్ సూచించారు. జాబితా ఫైనల్ అయితే వారికి సైతం ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించాలని మంత్రి కేటీఆర్ అక్కడే ఉన్న కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని స్పష్టమైన హామీ ఇచ్చారు. హైదరాబాద్ జర్నలిస్ట్ ల ఇళ్ళ స్థలాలపై కూడా అల్లం నారాయణ తో మాట్లాడానని, జే ఎన్ జే సొసైటీ తో సహా ప్రతీ జర్నలిస్ట్ కు ఇళ్లు అందించే విషయమై త్వరలోనే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments