ఆ ఐదుగురికి ఉరి
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో కీలక తీర్పు..
స్పాట్ వాయిస్, బ్యూరో: దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. బాంబు పేలుళ్ల కేసులో దోషుల పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఐదుగురు నిందితులకు 2016లో ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్షను విధించగా, ఎన్ఐఏ కోర్టు తీర్పును రద్దు చేయాలని వారంతా హైకోర్టుకు అప్పీల్కు వెళ్లారు. ఆ ఐదుగురు నిందితులు చేసిన అప్పీళ్లను హైకోర్టు తిరస్కరించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.
అప్పీల్ డిస్మిస్..
విచాణలో భాగంగా 157 మంది సాక్షులను విచారించారు. వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. 2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించింది. 2016 డిసెంబర్ 19న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జైలు శిక్ష, జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది. కాగా ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరుగుతోంది. నిందితులు అంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. మంగళవారం హైకోర్టు తుది తీర్పు ఇచ్చి, వారు దాఖలు చేసిన అప్పీల్ను డిస్మిస్ చేసింది.
Recent Comments