స్పాట్ వాయిస్, బ్యూరో: ఏవోబీలో కీలక నేత కుంజం హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఏకే 47తో పాటు పలు పేలుడు పదార్థాలకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషర్ కగార్ లో భారీ సంఖ్యలో మావోలు హతమవుతున్నారు. తాజాగా.. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత ఆపరేషన్ కగార్ మరింత దూకుడుగా కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్తో పాటు ఏవోబీ ప్రాంతంవైపు కూడా దృష్టిసారించారు. ఒడిశాలో కొన్ని ప్రాంతాల నుంచి భారీగా పేలుడు పదార్థాలును తీసుకువస్తున్నారన్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో పక్కా పథకం ప్రకారం హిడ్మాను అదుపులోకి తీసుకున్నారు.
Recent Comments