Monday, May 26, 2025
Homeజిల్లా వార్తలువైభవంగా హేమాచలుడి కళ్యాణం

వైభవంగా హేమాచలుడి కళ్యాణం

తరలివచ్చిన భక్తజనం
స్పాట్ వాయిస్, మంగపేట: మంగపేట మండలం మల్లూరు గ్రామ శివారులోని హేమాచల క్షేత్రంపై స్వయం భూగా వెలిసిన హేమాచల లక్ష్మీనృసింహస్వామి కళ్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. శ్రీశోభకృత్ నామ సంవత్సరం శుక్రవారం 12 గంటలకు అభిజిత్ లగ్నమందు తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భద్రాచలం దేవస్థానం వేదపండితులు అమరవాది మురళికృష్ణమాచార్యులు అర్చకబృందం స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణానికి బద్రాచలం ఎమ్మెల్యే పోదం వీరయ్య దంపతులకు పట్టు వస్తాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రవనం సత్యనారాయణ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ గ్రామాల భక్తుల ఆధ్వర్యంలో నిత్య అన్నదానం నిర్వహించారు. కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments