Sunday, April 20, 2025
Homeలేటెస్ట్ న్యూస్హన్మకొండ లో ఉద్రిక్తత..

హన్మకొండ లో ఉద్రిక్తత..

గుడిసెలు వేసుకున్న ప్రాంతాల పరిశీలనకు బయలెల్లిన సీపీఐ నాయకులు..
అడ్డుకున్న పోలీసులు..
కాకతీయ హరిత హోటల్ లో బైఠాయింపు..
స్పాట్ వాయిస్, హన్మకొండ: పేదలు గుడిసెలు వేసుకున్న భూముల వద్దకు వెళ్తుండగా సీపీఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. హరిత కాకతీయ హోటల్ లోనే అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో సీపీఐ నాయకులు అక్కడే బైఠాయించారు. బుధవారం హన్మకొండ హరిత హోటల్ లో భూ పోరాటానికి మద్దతు తెలిపేందుకు సీపీఐ పార్లమెంటరీ పక్ష నాయకుడు ఎంపీ బినోయ్ విశ్వం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరంపేదలు గుడిసెలు వేసుకున్న ప్రాంతాల పరిశీలనకు బయలెల్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బినోయ్ విశ్వం మాట్లాడుతూ.. పోలీసులు తమను అడ్డుకొని.. రియల్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల గొంతు ను అణచివేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ భూ కబ్జాదారులకు సపోర్ట్. చేస్తోందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments