Sunday, June 8, 2025
Homeక్రైమ్తెల్లవారుతుండగా.. తుపాకీ మోత..

తెల్లవారుతుండగా.. తుపాకీ మోత..

స్పాట్ వాయిస్ , క్రైం:  హైదరాబాద్‌ మాదాపూర్‌లో తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో ఇస్మాయిల్‌ అనే వ్యక్తిని ముజీబ్‌ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ముజీబ్‌ బైక్‌పై పరారయ్యాడు. ఈ కాల్పుల్లో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇస్మాయిల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. క్షతగాత్రుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భూమి గొడవల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఘటనా స్థలంలో మొత్తం ఐదుగురు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇస్మాయిల్‌, ముజీబ్‌ సహా మిగతా వారంతా పాతబస్తీకి చెందినవారీగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments