Friday, September 20, 2024
Homeతెలంగాణసింగరేణి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్..

సింగరేణి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్..

సింగరేణి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్..
ఏప్రిల్ 2న షెడ్యూల్
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. హైదరాబాద్‌లోని ఆర్‌ఎల్‌సీ కార్యాలయంలో తాజాగా కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా నియమితులైన శ్రీనివాసులు ఏప్రిల్‌ 2న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశానికి 32 కార్మిక సంఘాలను ఆహ్వానించగా, 15 సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కార్మిక సంఘాల ఎన్నికల కాల పరిమితి 4ఏళ్లు ఉండాలని టీబీజీకేఎస్‌, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంస్‌ కోరాయి. ఇది తమ పరిధిలో లేదని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి స్పష్టం చేశారు. సీఐటీయూ, బీఎంఎస్‌ సంఘాలు మాత్రం రెండేండ్ల కాలపరిమితికి అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నాయి. సమావేశంలో కాంట్రాక్ట్‌ కార్మికులకు ఓటు హక్కు కల్పించాలని కొన్ని సంఘాలు కోరినప్పటికీ అది సాధ్యపడదని, పర్మినెంట్‌ కార్మికులకు సంబంధించి ఎన్నికలు జరుగుతాయని రిటర్నింగ్‌ అధికారి స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్లను ప్రవేశపెడుతామని ఆర్‌వో పేర్కొనగా కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు జరుపాలని కోరాయి. ఏప్రిల్‌ 2న తిరిగి సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజే షెడ్యూల్‌ విడుదల చేస్తామని శ్రీనివాసులు ప్రకటించారు. 45 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో మే చివరి వారంలో సింగరేణిలో గుర్తింపు సం ఘం ఎన్నికలు జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments