డీజిల్ కుంభకోణంలో కిందిస్థాయి కార్మికుడిన బలి చేశారంటూ ఆగ్రహం..
స్పాట్ వాయిస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట గుండెపోటుతో మృతి చెందిన పీహెచ్ వర్కర్ మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. రెండేళ్ల క్రితం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో డీజిల్ కుంభకోణంలో పీహెచ్ వర్కర్ కనకం రఘును సస్పెండ్ చేశారు. డీజిల్ కుంభకోణంలో కనకం రఘు ను బలి చేశారని, అతను కేవలం వాచ్ మన్ పాత్ర పోషించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
కుంభకోణంలో పెద్దస్థాయి అధికారులు చేసిన తప్పులకు కిందిస్థాయి ఉద్యోగి బలి అయ్యాడని చెప్పారు. ఇటీవలే కోర్టు సైతం అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ ఓ అధికారి కావాలని మళ్లీ ఇబ్బంది పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమి చూసుకోకుండా సంతకాలు చేసి కిందిస్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారని ఇప్పటికైనా సదరు ఉద్యోగికి నష్టపరిహారం చెల్లించి, న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
Recent Comments