Wednesday, September 25, 2024
Homeజిల్లా వార్తలుప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే పెద్ది తనిఖీ..

ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే పెద్ది తనిఖీ..

ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే పెద్ది తనిఖీ..

సిబ్బంది వివరాలు, మందులపై ఆరా..

స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు ఆస్పత్రిలో వైద్యులు అందిస్తున్న వైద్య సేవలను, వైరాలజీ ల్యాబ్ & ఆసుపత్రి సిబ్బంది రికార్డును తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారితో.. మాట్లాడారు. అక్కడి స్థితిగతులపై ఆరా తీశారు. ఈ వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు , నివారణ చర్యలు చేపట్టి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments