Friday, September 27, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్

నేటి నుంచే విధుల్లోకి..
ఆదేశాలు జారీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ విధుల్లో చేరనున్నారు. బుధవారం నుంచే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించగా.. మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థులు ఆందోళన చేశారు. పార్టీ నేతలు, విజ్ఞప్తులు, డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ విధుల్లో చేరనున్నారు. గతంలో పనిచేసిన స్థానాల్లోనే ఫీల్డ్​ అసిస్టెంట్లు తిరిగి విధులు నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments