Saturday, September 21, 2024
Homeతెలంగాణటూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్‌గా గెల్లు శ్రీనివాస్ యాదవ్

టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్‌గా గెల్లు శ్రీనివాస్ యాదవ్

స్పాట్ వాయిస్, కమలాపురం: తెలంగాణ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్‌గా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ ను సీఎం కేసీఆర్ నియ‌మించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేర‌కు ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా వీణ‌వంక మండ‌లం హిమ్మత్‌న‌గ‌ర్ గ్రామం. ల‌క్ష్మి-మ‌ల్లయ్య దంప‌తుల‌కు గెల్లు శ్రీనివాస్ 1983, ఆగ‌స్టు 21వ తేదీన జ‌న్మించారు. ఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. రాజ‌నీతి శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు. తండ్రి గెల్లు మ‌ల్లయ్య కొండ‌పాక ఎంపీటీసీగా ప‌ని చేశారు. త‌ల్లి ల‌క్ష్మి హిమ్మత్‌న‌గ‌ర్ స‌ర్పంచ్‌గా సేవ‌లందించారు. ఇక గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ బీఆర్ఎస్ త‌ర‌పున హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి ఓడిపోయారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments