Monday, June 2, 2025
Homeజాతీయంగ్యాస్.. డీజిల్.. పెట్రోల్.. ధరలు పెరిగాయ్..

గ్యాస్.. డీజిల్.. పెట్రోల్.. ధరలు పెరిగాయ్..

గ్యాస్.. డీజిల్.. పెట్రోల్..
ధరలు పెరిగాయ్..
చమురు కంపెనీలు షాక్‌ ఇచ్చాయి. గృహ వినియోగ సిలిండర్‌ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒకేసారి ఏకంగా రూ.50 పెంచేసేయ్. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోమవారం ఎల్‌పీజీ ధరలను రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించారు. ఉజ్వల, సాధారణ కేటగిరీ వినియోగదారులకు గ్యాస్ ధరను పెంచినట్లు మంత్రి ప్రకటించారు. దీంతో 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.803 నుంచి రూ.853కి పెరగనున్నది. పెరిగిన సిలిండర్‌ ధరలు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇదిలా ఉండగా.. కేంద్రం లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై రూ.2 ఎక్సైజ్‌ డ్యూటీని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొంది. ఎక్సైజ్ డ్యూటీ పెరుగుదలతో పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరల్లో.. పెరుగుదల ఉండదని చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సమాచారం ఇచ్చినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది

RELATED ARTICLES

Most Popular

Recent Comments