Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుశాంతిభద్రతల పరిరక్షణకు కృషి..

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి..

గణపురం ఎస్సై అభినవ్
స్పాట్ వాయిస్, గణపురం: మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై అభినవ్ అన్నారు. గణపురం ఎస్సైగా అభినవ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం క్రయవిక్రయాలు, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు పోలీసులతో స్నేహభావంతో ఉండాలని ప్రజల సహకారంతోనే నేరాలను అదుపు చేయగలమని తెలిపారు. మండల ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందిస్తానన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం కొనసాగిస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments