Friday, September 20, 2024
Homeక్రైమ్పురుగుల మందు తాగి ఇద్దరి ఆత్మహత్య

పురుగుల మందు తాగి ఇద్దరి ఆత్మహత్య

పురుగుల మందు తాగి ఇద్దరి ఆత్మహత్య

స్పాట్ వాయిస్, గణపురం: పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల వివరాల ప్రకారం… మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన దశరథం(35) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవాడు. గత కొంత కాలంగా దశరథం మద్యానికి బానిసైయ్యాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. అది గమనించి కుటుంబ సభ్యులు 108 వాహనంలో ములుగు సివిల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి, కుమారుడు,కూతురు ఉన్నారు.

అదేవిధంగా పరుశరాంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రవినగర్ చెంచుకాలనికి చెందిన శీలం సంపత్(40) అనే కూలీ తాగుడుకు బానిసై పనికి వెళ్లకుండా తిరుగుతుండంతో భార్య రజిత మందంలించగా మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. అతని 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సంపత్ మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments