Thursday, September 19, 2024
Homeజిల్లా వార్తలుగంజాయి విక్రయదారుడి అరెస్ట్..

గంజాయి విక్రయదారుడి అరెస్ట్..

స్పాట్ వాయిస్, కాజీపేట: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని, నిందితుడి వద్ద నుంచి 21 వేల విలువైన గంజాయిని పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఎస్సై నవీన్ కుమార్ సిబ్బందితో కలిసి కాజీపేట ఏరియాలో ఆదివారం పెట్రోలింగ్ చేస్తుండగా రైల్వే పాలీ క్లినిక్ హాస్పిటల్ ఏరియాలో ఓ వ్యక్తి పోలీసులను చూసి భయపడి పారిపోతుండగా అతనిని పట్టుకున్నారు. అతడి చేతిలో ఉన్న బ్యాగును తనిఖీ చేయగా.. ఎండు గంజాయి లభించినట్లు తెలిపారు. నిందితుడు కాజీపేట విష్ణుపురి చెందిన గొర్రె ప్రశాంత్ గా గుర్తించారు. సులువుగా డబ్బు సంపాదించాలని 20 రోజుల క్రితం వైజాగ్ వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి రైలులో కాజీపేట రైల్వే జంక్షన్ వచ్చారు. జనాలు అధికంగా ఉండడంతో రైల్వే పాలీ క్లినిక్ వద్ద ఖాళీ స్థలంలో గంజాయి అమ్మకాలు చేద్దామని నిశ్చయించుకొని వేచి ఉండగా పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడి నుంచి 21 వేల విలువైన గంజాయి లభించిందన్నారు. ఇన్ స్పెక్టర్ లవన్ కుమార్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments