Saturday, May 24, 2025
Homeజిల్లా వార్తలుగంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరి అరెస్ట్

గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరి అరెస్ట్

స్పాట్ వాయిస్, కాటారం: గంజాయి తాగడమే కాకుండా సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కాటారం ఎస్సై అభినవ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాటారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సగ్గెం వంశీ, పెద్ది నిఖిల్ రాజు ఇద్దరు స్నేహితులు. వీరు ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నారు. ఈ క్రమంలో గంజాయికి అలవాటు పడి గంజా సరఫరా చేస్తూ సగ్గెం వంశీకి అమ్ముతుండగా కాటారం పోలీస్ పట్టుకున్నారు. వారి వద్ద 180 గ్రాముల బరువు గల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments