Saturday, September 21, 2024
Homeతెలంగాణనిన్న తిట్టాడు.. ఇయ్యాల కొట్టాడు..

నిన్న తిట్టాడు.. ఇయ్యాల కొట్టాడు..

బూతుల వేడి తగ్గకముందే.. ఫైటింగ్‌ సీన్
వరంగల్ మాజీ కార్పొరేటర్ నిర్వాకం
మా పార్టీని విమర్శిస్తావా.. అంటూ ముష్టియుద్ధం
మితిమీరుతున్న అధికార పార్టీ నాయకుడి ఆగడాలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు
స్పాట్ వాయిస్, వరంగల్: తిట్లదండకం.. వేడి తగ్గకముందే.. మళ్లీ ఫైట్ సీన్ తో అంతకుమించిన హాట్ టాపిక్ గా మారారు.. వరంగల్ లోని 38వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఉమ భర్త, మాజీ కార్పొరేటర్ దామోదర్ యాదవ్. వరంగల్ గ్రేటర్ వరంగల్ లో బతుకమ్మల దగ్గర సమయానికి లైటింగ్స్ ఏర్పాటు చేయలేదని అధికారులను బూతులు తిట్టిన నాయకుడి ఆడియో ఒక వైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఒక వైపు అధికార పార్టీల అలజడి సృష్టించడమే కాకుండా.., ప్రజల్లో చర్చ జరుగుతున్న కొద్దినిమిషాల వ్యవధిలోనే మనోడు..తన చేతులకు పని చెప్పాడు. తన అనుచరులతో బీజేపీ నాయకుడిపై దాడికి పాల్పడ్డాడు. పడమరనకోటలోని చమన్ వద్ద మరో వ్యక్తితో మాట్లాడుతున్న బీజేపీ కార్యకర్త, సోషల్ మీడియా కన్వీనర్ ఇనుములు అరుణ్ పై బైరబోయిన దామోదర్ యాదవ్ అకారణంగా దాడి చేసినట్లు కేసు నమోదైంది. తరచూ టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నావంటూ అనుచరులతో కలిసి దాడి చేసినట్లు అరుణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ బైరబోయిన దామోదర్ పై ఫిర్యాదు చేశారు. అరుణ్ పై దాడిని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, పార్టీ రాష్ర్ట నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఖండించారు. అరుణ్ పై మాజీ కార్పొరేటర్ దామోదర్ యాదవ్ దాడి చేయడాని హేయమైన చర్యగా అభివర్ణించారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దామోదర్ యాదవ్ పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments