Thursday, May 29, 2025
Homeజిల్లా వార్తలుభక్తుల తాగునీటి కోసం బోరు వేయించిన జీఎస్ఆర్

భక్తుల తాగునీటి కోసం బోరు వేయించిన జీఎస్ఆర్

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలోని రామలింగేశ్వర సహిత అభయాంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు తాగునీటి సౌకర్యార్థం కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ గండ్ర సత్యనారాయణ రావు సొంత ఖర్చలతో బోరు వేయించి మోటారు ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం సర్పంచ్ ఒద్దుల విజయ అశోక్ రెడ్డి పూజాకార్యక్రమాలు నిర్వహించి, బోరు తవ్వకం పనులు ప్రారంభించారు. భక్తులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గండ్ర సత్యనారాయణ రావు బోరు వేయించారు. దీంతో భక్తులకు నీటి సమస్య తీరిపోవడంతో జీఎస్ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మొలుగూరి రాజు, ఏడెల్లి మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వీరమల్ల సంపత్ రెడ్డి, ఓద్దుల రాంరెడ్డి, పున్నం రఘుపతి రెడ్డి, ముదిగొండ సదానందం, తదితరులు పాల్గొన్నారు.


మేళ తాళం వితరణ
భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామానికి చెందిన నల్ల ఇందిర సుఖేందర్ రెడ్డి, విహారికా రెడ్డి లక్ష్మారెడ్డిపల్లెలోని శ్రీ రామలింగేశ్వర సహిత అభయాంజనేయ ఆలయానికి ఎలక్ట్రానిక్ మేళతాళాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడెల్లి శోభ మల్లారెడ్డి, రామిడి కోమలాదేవి, బక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments