విరబూసిన బ్రహ్మ కమలం..
రాత్రి ప్రత్యేక పూజలు
స్పాట్ వాయిస్, గణపురం: ఎక్కడో హిమాలయ ప్రాంతాలకే పరిమితమైన బ్రహ్మ కమలం ఇప్పుడు పలు ఇళ్లల్లో వికసిస్తోంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వికసించే ఈ పువ్వు తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లె గ్రామంలో ఎడెల్లి సుమతి రమాదేవి- చంద్రారెడ్డి దంపతుల ఇంట్లో శనివారం రాత్రి విరబూసి అందరినీ పులకరింపచేసింది. చాలా అరుదైన, ప్రత్యేకత గల పుష్పం గ్రామంలో వికసించడంతో పుష్పాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పుష్పానికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఏడిలెల్లి దంపతులు మాట్లాడుతూ తమ ఇంట్లో బ్రహ్మ కమలం పూయడం ఆనందంగా ఉందన్నారు. మూడు సంవత్సరాల క్రితం హైదరాబాదు నుంచి ఈ మొక్కను తీసుకువచ్చి తమ ఇంటి పెరట్లో నాటామన్నారు. తాజాగా రాత్రి 9 గంటల సమయంలో బ్రహ్మ కమలం విరబూసిందని వారు చెప్పారు.
Recent Comments