Monday, May 26, 2025
Homeలేటెస్ట్ న్యూస్వరద ఉధృతికి కొట్టుకుపోయిన ట్రాలీ

వరద ఉధృతికి కొట్టుకుపోయిన ట్రాలీ

డ్రైవర్ ను కాపాడిన స్థానికులు
స్పాట్ వాయిస్, కాటారం: కాటారం మండలంలోని దామెరకుంట-గుండ్రాత్ పల్లి మధ్యలోని అలుగు వాగులో ట్రాలీ వాహనం కొట్టుకుపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వంట పాత్రలు, సామగ్రి విక్రయించే సరకు రవాణా ట్రాలీ వాహనం శుక్రవారం తెల్లవారుజామున అన్నారం నుంచి దామెరకుంట వైపు వెళ్తోంది. అలుగు వాగు ఉద్ధృతిని గమనించకుండా డ్రైవర్ ముందుకు వెళ్లడంతో వాహనం వాగులో కొట్టుకుపోయింది. దీంతో డ్రైవర్ వాహనంపైకి ఎక్కి ఆర్తనాదాలు చేశారు. గమనించిన గ్రామస్తులు అతనిని రక్షించారు. అయితే గురువారం సాయంత్రం నుంచే అలుగు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments