మృగశిర సందడి
చేపలకు ఫుల్ డిమాండ్
ధరలు పెంచి అమ్మిన వ్యాపారులు
కిలో రూ. 250 పైమాటే..
స్పాట్ వాయిస్, గణపురం: మృగశిర కార్తె సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఆయా గ్రామాల్లో చేపల అమ్మకాలు జోరుగా సాగాయి. మృగశిర రోజు చేపలు తినడం ఆనవాయితీ కావడంతో వ్యాపారులు చేపలను ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి విక్రయించారు. గణపురం మండల కేంద్రంలోని చేపల మార్కెట్లో కొనుగోలుదారులతో కిటకిటలాడింది. చేపలను కొనుగోలు చేసేందుకు జనం ఈ మండలం నుంచే కాకుండా పక్క మండలాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. వ్యాపారులు ఇదే అదునుగా భావించి చేపల ధరలు అమాంతం పెంచేశారు. చేపల రకాలను బట్టి ధరను రూ.250 నుంచి రూ. 400 వరకు పెంచి విక్రయించారు.
Recent Comments