Tuesday, June 3, 2025
Homeక్రైమ్ఆ ఇద్దరు ఎక్కడా..?

ఆ ఇద్దరు ఎక్కడా..?

ఇద్దరు ఎక్కడా..?

ప్రమాదం జరిగి నాలుగు రోజులు..

నేటికీ లభ్యం కాని మృతదేహాలు..

స్పాట్ వాయిస్, బ్యూరో: సికింద్రాబాద్ లోని డెక్కెన్‌ స్పోర్ట్స్‌ మాల్‌ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిoదే. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. అయితే.. ఇప్పటి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభ్యo అయిoది. కనిపించకుండాపోయిన యువకుల కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతున్నా.. మృతదేహాలు కనిపిoచలేదు
గల్లంతైన వారి కోసం గాలింపు సాగుతోంది. వసీం, జునైద్‌, జహీర్‌ కోసం జరిపిన గాలింపులో.. ఒకరి మృతదేహం అవశేషాలు లభించాయి. అయితే అవి ఎవరివి అనే విషయం ఇంకా తేలలేదు. అగ్నిమాపక శాఖ అధికారులు, క్లూస్‌ టీం నిపుణులు అన్ని అంతస్తుల్లో దాదాపు గాలించినా.. ఎలాంటి ఫలితం కనిపించ లేదు. మొదటి, రెండో అంతస్తు పైకప్పులు కూలి కిందపడటంతో అది పూర్తిగా శిథిలాలతో నిండింది. కెమెరాలు, ప్రత్యేక లైట్లతో గాలించిన క్లూస్‌టీం భవనంలోని కొన్ని వస్తువుల నమూనాలను సేకరించారు. ఆ శిథిలాల కింద మృతదేహాల అవశేషాలు ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments