Saturday, September 21, 2024
Homeక్రైమ్ఐదు రోజుల పాపను విక్రయించిన తండ్రి..

ఐదు రోజుల పాపను విక్రయించిన తండ్రి..

ఐదు రోజుల పాపను విక్రయించిన తండ్రి..

ములుగు జిల్లాలో ఘటన 

స్పాట్ వాయిస్ , ములుగు: ఐదు రోజుల పాపను తండ్రే విక్రయించిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురంలో చోటు చేసుకుంది. నూగురు వెంకటాపురం గ్రామానికి చెందిన జంపయ్య, లక్ష్మీ దంపతులకు ఇటీవల ఓ పాప జన్మించింది. అయితే ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంకు చెందిన సుధాకర్ అనే వ్యక్తికి నవజాత శిశువును విక్రయించేందుకు కన్న తండ్రే బేరం పెట్టాడు. భార్యకు తెలియకుండా పాపను తీసుకెళ్లి రూ.15వేలు, పాత ద్విచక్రవాహనం తీసుకుని చిన్నారిని అమ్మేశాడు.

అయితే పాప చనిపోయిందని, తానే స్వయంగా ఖననం చేశానని చెప్పి భార్య, బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు. జంపయ్య మనస్తత్వం తెలిసిన కుటుంబసభ్యులు, బంధువులు గట్టిగా నిలదీశారు. దీంతో పాపను అమ్మేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో నివ్వేరపోయిన బంధువులు ఏటూరు నాగారం పోలీసులను ఆశ్రయించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments