Saturday, June 7, 2025
Homeక్రైమ్భూపాలపల్లి-పరకాల రోడ్డుపై ఘోర ప్రమాదం..

భూపాలపల్లి-పరకాల రోడ్డుపై ఘోర ప్రమాదం..

టిప్పర్ ను ఢీకొన్న బస్సు..
స్పాట్ వాయిస్, రేగొండ: భూపాలపల్లి -పరకాల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ టిప్పర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు క్లీనర్, బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాంగ్ రూట్లో రావడంతో ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొన్నాడని తెలిపారు. ఈ ఘటనలో టిప్పర్ వెనుక వస్తున్న ఓ కారు కూడా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు వెంటనే కారు నుంచి దిగిపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments