Thursday, April 17, 2025
Homeక్రైమ్భద్రాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం..

భద్రాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం..

వరంగల్, హన్మకొండ జిల్లాలకు చెందిన నలుగురు మృతి
స్పాట్ వాయిస్ కమలాపూర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఇల్లెందు-మహబూబాబాద్‌ మధ్య కోటిలింగాల సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన బైరి రాము, బాష బత్తిని అరవింద్, వరంగల్ కు చెందిన కల్యాణ్‌, శివగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేటకు చెందిన రణధీర్‌గా అనుమనిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తున్న వీరు స్నేహితులతో కలిసి ఏపీలోని చింతూరులో వెడ్డింగ్ ఫొటోలు తీయడానికి కార్లు వెళ్తుండగా ఇల్లందు గ్రామంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నారు. నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన వ్యక్తిని ఇల్లందు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

రాము
రాము
అరవింద్
RELATED ARTICLES

Most Popular

Recent Comments