Saturday, June 7, 2025
Homeక్రైమ్పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

స్పాట్ వాయిస్, దామెర: ఆర్థిక ఇబ్బందులు భరించలేక పురుగులు మందు తాగి రైతన్న ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన దామెర మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై హరిప్రియ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన హింగె వీరన్న(58) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల కాలంలో కురిసిన ఆకాల వర్షాల కారణంగా పంట దెబ్బతిని, పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడి ఎక్కువై, పంట దిగుబడి తగ్గి అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. చేసిన అప్పు ఎలా చెల్లించాలో తెలియక మనస్థాపానికి గురై మంగళవారం తన పంట చేను వద్దకు పోయి పురుగుల మందు తాగాడు. రాత్రి అయినా మృతుడు హింగె వీరన్న ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతకగా బుధవారం ఉదయం తన పంట చేను వద్ద చనిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య హింగె విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిప్రియ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments