Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్త్వరలోనే రైతు బంధు..

త్వరలోనే రైతు బంధు..

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ర్టంలోని రైతులందరికీ ప్రభుత్వం నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆర్థిక, వ్యవసాయ శాఖలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ ను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తర్వలోనే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులకు ఏమైనా సమస్యలుంటే ఈ కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కొన్ని రాజకీయ కారణాలతో నిధులు రాలేదని, కేంద్రం కావాలనే ఇబ్బంది పెడుతుందని, తామే నిధులు సమకూర్చుకొని రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. రైతులను పత్తి పంట ఎక్కువగా వేయాలని కోరుతున్నామని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments