Friday, September 20, 2024
Homeకెరీర్ప్రారంభమైన టెన్త్ ఎగ్జామ్స్

ప్రారంభమైన టెన్త్ ఎగ్జామ్స్

స్పాట్ వాయిస్, గణపురం: పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత మొదటిసారిగా ప్రత్యక్షంగా పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల సందడి నెలకొన్నది. గణపురం మండల వ్యాప్తంగా రెండు సెంటర్లలో 381 మంది విదార్థులు పరీక్షలకు హాజయ్యారు. గణపురం మోడల్ స్కూల్లో 238, చెల్పూర్ జెడ్పీ స్కూల్లో 143 మంది పరీక్షలకు హాజరయ్యారు. మొదటి రోజు ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా స్థానిక ఎస్సై అభినవ్ పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను తహసీల్దార్ సతీష్ కుమార్, మండల విద్యాధికారి చిలువేరు సురేందర్ తనిఖీ నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments