Friday, April 18, 2025
Homeజిల్లా వార్తలుమురిసిన మంత్రి

మురిసిన మంత్రి

చేపల కోసం గాలమేసిన ఎర్రబెల్లి
సాయంకాలం పూట.. సరదాగా..
ఆనందం వ్యక్తం చేసిన దయాకర్ రావు 

స్పాట్ వాయిస్, నెల్లికుదురు : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లిగూడెం శివారు నీటి కాలువలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం చేపలు పట్టి సరదా తీర్చుకున్నారు. ఓ కార్యక్రమానికి హాజరై, తిరుగు ప్రయాణమైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్తూ.. మార్గమధ్యమంలో కొంతమంది పిల్లలు గాలలతో చేపలు పడుతుండటాన్ని గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి, వారి వద్దనున్న గాలలను తీసుకొని, తాను కూడా కాసేపు చేపల గాలం వేశారు. చిన్నతనంలో సరదాకు గాలలతో చేపలు పట్టేవాడినని, మళ్లీ ఇన్నేళ్లకు చేపలు పట్టడం ఆనందంగా ఉందని మంత్రి మురిసిపోయారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments