మావోలకు భారీ ఎదురు దెబ్బ..
స్పాట్ వాయిస్, బ్యూరో: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటన మరువకముందే.. మరో అగ్రనేత ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. చత్తీస్గఢ్లోని బీజాపూర్ నేషనల్ పార్కు వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్(65) (తెంటు లక్ష్మీనరసింహాచలం)మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. 40 ఏండ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతున్నారు. 2004లో నాటి ఏపీ ప్రభుత్వంతో సుధాకర్ శాంతి చర్చల్లో పాల్గొన్నారు. సింహాచలం అలియాస్ సుధాకర్పై రూ. 50 లక్షల రివార్డు ఉంది.
మరో కేంద్ర కమిటీ సభ్యుడు హతం..
RELATED ARTICLES
Recent Comments