Saturday, April 19, 2025
Homeక్రైమ్కోతుల కోసం విద్యుత్ కంచె.. బలైన బాలుడు

కోతుల కోసం విద్యుత్ కంచె.. బలైన బాలుడు

కరెంట్ తీగ తగిలి 15 ఏళ్ల బాలుడు మృతి
కేసముద్రం మండలం మర్రితండాలో ఘటన
మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన
స్పాట్ వాయిస్, కేసముద్రం: మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. కోతుల కోసం వేసిన కంచెం బాలుడి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే కేసముద్రం మండలంలోని మర్రితండాలో ఓ రైతు తన పొలాన్ని కోతుల నుంచి కాపాడుకునేందుకు విద్యుత్ తీగలతో కంచె ఏర్పాటు చేశాడు. సోమవారం ప్రమాదవశాత్తు ఈ తీగలు తగిలి బాలుడు జీవన్(15) మృతి చెందాడు. దీంతో బాలుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు పెనుగొండ చెరువు ముందు తండాలోని పొలం యజమాని ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. కేసముద్రం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments