Monday, September 30, 2024
Homeలేటెస్ట్ న్యూస్సంగారెడ్డిలో భూకంపం..

సంగారెడ్డిలో భూకంపం..

సంగారెడ్డిలో భూకంపం..
పరుగులు తీసిన జనం
స్పాట్ వాయిస్, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాను భూకంపం కుదిపేసింది. కోహీర్‌ మండలం బిలాల్‌పూర్‌లో ప్రకంపనలు రాగా.. ఒక్కసారిగా జనం ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం వేకువజామున 3.20 గంటల సమయంలో రిక్కర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. నల్గొండకు 117 కిలోమీటర్ల దూరం, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. గతంలో జనవరిలోనూ కోహీర్‌ మండలంలో పలుచోట్ల భూకంపం కనిపించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments