ఆలోచింపజేసిన ప్రదర్శనలు
జిల్లా రంగస్థలం కళాకారులు కుసుమ సుధాకర్, సాదుల సురేష్ కు ఘన సన్మానం
స్పాట్ వాయిస్, కల్చరల్ : తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఎఫ్ డీసీ), ఐక్యవేదిక పరపతి సంఘం సభ్యుల సహకారంతో వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోతన విజ్ఞాన పీఠం వేదికగా ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమైన జాతీయ స్థాయి ఆహ్వాన నాటక పోటీలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి. ముఖ్యఅతిథిగా ఈగ మల్లేశం, విశిష్ట అతిథిగా కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ,ఆత్మీయ అతిథులు డాక్టర్ శ్రీరామోజు సుందర మూర్తి, వడ్డేపల్లి నర్సింగరావు, పొగాకు రాజేశ్వరరావు, డాక్టర్ ఎన్ ఎస్సార్ మూర్తి, సభాధ్యక్షులు ఖాజీపేట తిరుమలయ్య ఆదివారం నాటి పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఈగ మల్లేశం మాట్లాడుతూ సమాజంలోని చెడును ఎత్తిచూపుతో, మనుషులను మంచి మార్గంలో ప్రయాణింపజేసే కళ నాటకం అని, దానిని ప్రోత్సహించడం మన కర్తవ్యమన్నారు. కళాకారులను ప్రోత్సహిస్తూ దాతలు వధాన్యులు తగిన సహాయ సహకారాలు అందించి, నాటక రంగాన్ని భావితరాలకు అందించాలని సూచించారు. విశిష్ట అతిథి ప్రొఫెసర్ వి.రామచంద్రం మాట్లాడుతూ ఓరుగల్లు నగరంలో ప్రజలను చైతన్యపరిచేందుకు నాటకాల ద్వారా కృషి చేస్తున్న సభ్యులను అభినందించారు. సమాజంలోని మంచి చెడులను విమర్శించగల శక్తి నాటకాలకు ఉందని, ఈ నాటకాలు ఒక ప్రత్యేకమైన ఒరవడి కలిగి ప్రజలను ఆకర్షించేలా, చైతన్య పర్చేలా ఉంటాయని వాటిని ఆదరించాలని కోరారు. అనంతరం శాస్త్రీయ నృత్య కళాక్షేత్రం రంగసాయిపేట, పీఎస్ పీ నృత్య అకాడమీ హంటర్ రోడ్ సతీష్ కుమార్ కుమార్ గారి శిష్య బృందంచే స్వాగతం నృత్యం, శాస్త్రీయ నృత్య ప్రదర్శన జరిగింది. తరువాత జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక కమిటీ సభ్యులు కలిసి ప్రముఖ రంగస్థల కళాకారులైన కుసుమ సుధాకర్, సాదుల సురేష్ ను ఘనంగా సన్మానించారు.
మొదటి నాటిక గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ నాటక ప్రదర్శన.. (ఒక ట్రాన్స్ జెండర్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది. సమాజం ఏ విధంగా చూస్తుంది అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ సందేశాత్మక ఇతివృత్తం) ఇందులో ఒక ట్రాన్స్ జెండర్ నటించడం ఈ నాటిక ప్రత్యేకత. రచన జ్యోతిరాజ్ భీశెట్టి, వెంకట్ గోవాడ గారి దర్శకత్వంలో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నాటకానికి అరుణ్ కుమార్, శ్రీధర్ పారితోషకం అందజేశారు. రెండో నాటికగా ఉషోదయ కళానికేతన్ కాట్రపాడు వారి కిడ్నాప్ ( కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ చెప్పుడు మాటలు వల్ల కుటుంబం ఏ విధంగా అతలాకుతలం అవుతుందో) తెలిపే సందేశంతో చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వంలో ప్రదర్శించారు. ఈ నాటికకు వీనస్ ఐటీఐ చైర్మన్ శ్రీరామోజు సుందర మూర్తి పారితోషికం అందజేశారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఎన్ ఎస్ ఆర్ మూర్తి, జేఎన్ శర్మ, సాధుల సురేష్, బీటవరం శ్రీధరస్వామి, కుసుమ సుధాకర్, మాలి విజయరాజ్, జూలూరు నాగరాజు, నాగపురి సంజయ్ బాబు, వెంపటి శ్రావణి, దేవరాజు రవీందర్, వేముల ప్రభాకర్, సీత వెంకటేశ్వర్లు, షఫీ, జక్కోజు సత్యనారాయణ, కోటేశ్వరరావు, ఆకుల సదానందం, మాడిశెట్టి రమేష్, కళా రాజేశ్వరరావు, ఓడపల్లి చక్రపాణి, కవులు, కళాకారులు, కళాభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొని నాటకాలను ఆధ్యాంతం తిలకించి ఆనందించారు.
Recent Comments